Kothakota Srinivas Reddy : డ్ర‌గ్స్ పై ఉక్కు పాదం మోపాలి

స్ప‌ష్టం చేసిన కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి

Kothakota Srinivas Reddy : హైద‌రాబాద్ – సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కొత్త‌కోట్ శ్రీ‌నివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌ను కొలువు తీరాక దూకుడు పెంచారు. చ‌ర్య‌లు తీసుకునేందుకు ఫోక‌స్ పెట్టారు. ప్ర‌ధానంగా నీతి, నిజాయితీ క‌లిగిన అధికారిగా గుర్తింపు పొందారు కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి.

Kothakota Srinivas Reddy Comments on Drugs

ఆదివారం ఐసీసీసీ భ‌వ‌నంలో సిటీ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని అన్ని జోన‌ల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్ పెక్ట‌ర్ల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నారు. ఇందులో ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సీపీ కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి.

ఇందులో మాద‌క ద్ర‌వ్యాల నిర్మూల‌న‌, ట్రాఫిక్ అమ‌లు, ప‌రిశోధ‌న‌, ప్రాథ‌మిక పోలీసింగ్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు సీపీ. సీఎం(CM) ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ న‌గ‌రాన్ని డ్ర‌గ్స్ లేని న‌గ‌రంగా తీర్చి దిద్ద‌డం కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇందుకు సంబంధించి ఎవ‌రైనా స‌రే, ఎంత‌టి స్థాయిలో ఉన్నా స‌రే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌ధానంగా డ్ర‌గ్స్ పై ఉక్కు పాదం మోపుతామ‌ని మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Also Read : Amaravathi JAC : అమరావ‌తి పోరాటానికి నాలుగేళ్లు

Leave A Reply

Your Email Id will not be published!