Madhuri Dixit Tim Cook : మాధురి యాపిల్ సిఇఓ వైరల్
వడ పావ్ ను పరిచయం చేసిన నటి
Madhuri Dixit Tim Cook : ప్రపంచంలోనే టాప్ మొబైల్ కంపెనీగా పేరొందిన యాపిల్ సంస్థ సిఇఓ టిమ్ కుక్ వడ పావ్ కు ఫిదా అయ్యారు. దానిని ఎవరో కాదు పరిచయం చేసింది. అందాల ముద్దుగుమ్మ, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.(Madhuri Dixit Tim Cook) ఇద్దరూ కలిసి ముంబై రెస్టారెంట్ లో వడ పావ్ ను రుచి చూశారు.
దీంతో యాపిల్ సిఇఓ ఆమె ఆహ్వానాన్ని మన్నించి వడ పావ్ ను తిన్నారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా టిమ్ కుక్ స్పందించారు. అంతులేని ఆనందాన్ని పొందినట్లు పేర్కొన్నారు. చాలా రుచికరంగా ఉందని, తాను మరిచి పోలేనని పేర్కొన్నారు టిమ్ కుక్(Tim Cook).
మరోసారి వడ పావ్ ను తినాలని ఉందంటూ ఆసక్తిని వ్యక్తం చేశాడు యాపిల్ సిఇఓ. భారత దేశంలో యాపిల్ కంపెనీ రెండు స్టోర్లను ప్రారంభించింది. ఒకటి ఢిల్లీలో రెండోది ముంబైలో. దీనిని ప్రారంభించేందుకు ఇండియాకు వచ్చారు ప్రత్యేకంగా యాపిల్ సిఇఓ. ఈ సందర్బంగా మాధురీ దీక్షిత్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పలు అంశాలపై చర్చలు కూడా జరిపారు. ఇదే సమయంలో వారిద్దరూ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ రుచికకరమైన టిఫిన్లను ఆర్డర్ ఇచ్చారు మాధురీ దీక్షిత్. నటి ఇచ్చిన ఆఫర్ ను కాదనలేక పోయారు టిమ్ కుక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ