Bajrang Punia : పతకాలు తిరిగి ఇచ్చేస్తున్నా – పునియా
ఖాకీల జులుం ఇంకానా ఇకపై చెల్లదు
Bajrang Punia : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మహిళా రెజ్లర్ల ఆందోళన తారా స్థాయికి చేరింది. ఢిల్లీ ఖాకీలు దురుసుగా ప్రవర్తించారు. అర్ధరాత్రి దాడికి దిగారు. మహిళలని చూడకుండా దురుసుగా ప్రవర్తించారంటూ రెజ్లర్ బజ్ రంగ్ పునియా(Bajrang Punia) ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కష్ట సమయంలో దేశం మొత్తం తమకు మద్దతు ఇవ్వాలని కోరాడు. గురువారం బజ్ రంగ్ పునియా మీడియాతో మాట్లాడాడు. ఖాకీలు బలవంతంగా మాపై దాడికి దిగారు. తాము ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. తాము నేరస్థులం కామని, ఇబ్బందులకు గురి చేస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతూ పవర్ ను ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
మహిళలపై దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు దేశాన్ని నమ్ముకున్నామని, తాము ఇప్పటి వరకు దేశం కోసం శ్రమకోర్చి పతకాలు తీసుకు వచ్చామని కానీ తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోయాడు. అందుకే తమకు వచ్చిన పతకాలను, ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నానని సంచలన ప్రకటన చేశాడు రెజ్లర్ బజ్ రంగ్ పునియా(Bajrang Punia).
ఇంతగా తాము ఆందోళన చేపట్టినా ఎందుకని డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ పై చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. అంగ బలం, అర్థ బలం, అధికార బలం ఉదని విర్రవీగుతున్నాడని, ఆయనకు కేంద్రం వంత పాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఈ దేశాన్ని చూస్తే బాధేస్తోందని వాపోయాడు బజ్ రంగ్ పునియా.
Also Read : ఖాకీల దౌర్జన్యం రెజ్లర్లకు గాయం