Raghu Veera Reddy : బాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం
మాజీ మంత్రి రఘువీరా రెడ్డి
Raghu Veera Reddy : శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లా – మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి(Raghu Veera Reddy) సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం దాగి ఉందని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేసి , బీజేపీ బతకాలని అనుకుంటోందన్నారు. బీజేపీ అనేది ఒక అనకొండ లాంటిదన్నారు. రాబోయే రోజుల్లో జగన్ పార్టీకి కూడా ఇదే పరిస్థితి రానుందని హెచ్చరించారు రఘువీరా రెడ్డి.
Raghu Veera Reddy Comments Viral
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాబు అరెస్ట్ వెనుక పక్కా స్కెచ్ వేశారని ఆరోపించారు. ఓ వైపు వైసీపీతో స్నేహం చేస్తూ మరో వైపు టీడీపీని బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్న సమాచారం తనకు తెలిసిందన్నారు. జగన్ భుజంపై తుపాకీ పెట్టి ఏపీలో రాజకీయాలు నడుపుతోందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సంతోషంగా ఉన్న ఏపీ సీఎంకు రాబోయే రోజుల్లో ఏడ్వడం తప్ప ఇంకేమీ ఉండదన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై టీడీపీ ఎన్ని ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు , నిరసనలు చేసినా ఫాయిదా ఏమీ ఉండదన్నారు. కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని వాటి ద్వారానే పరిష్కరించు కోవాలని సూచించారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.
Also Read : Nara Brahmani : జనం మౌనంగా వింటే ఎలా