Ramdas Roy Manthena : టీఎస్పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాలి

ఎన్నారై రాయ‌దాస్ రాయ్ మంతెన‌

Ramdas Roy Manthena : హైద‌రాబాద్ – ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో అస్త‌వ్య‌స్తంగా మారి, ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల ఆశ‌లపై నీళ్లు చ‌ల్లిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ను వెంట‌నే ప్ర‌క్షాళ‌న చేయాల‌ని తెలంగాణ ఎన్నారై రాయ‌దాస్ రాయ్ మంతెన డిమాండ్ చేశారు.

Ramdas Roy Manthena Comment

రాష్ట్ర నూత‌న ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొండారెడ్డిప‌ల్లి స్వ‌స్థ‌లానికి చెందిన రేవంత్ రెడ్డిని(Revanth Reddy) క‌లిసి అభినందించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అక్ర‌మాలు, అవినీతికి పాల్ప‌డిన టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు బోర్డు స‌భ్యుల‌ను తొల‌గించాల‌ని, వారిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు.

రాష్ట్రానికి సంబంధించి ఎంద‌రో ఉన్న‌త‌మైన , అర్హ‌త‌, అనుభ‌వం, నిజాయితీ క‌లిగిన ఉన్న‌తాధికారులను నియ‌మించాల‌ని సూచించారు రాయ‌దాస్ రాయ్ మంతెన‌. ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థ‌లో చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని , చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు రాయ‌దాస్ రాయ్ మంతెన‌.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. పేపర్ లీకేజీలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. దీనిపై గ‌తంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ నిర్ల‌క్ష్యంగా స‌మాదానం ఇచ్చారు.

Also Read : KC Venu Gopal : రేవంత్ రెడ్డినే సీఎం – ఏఐసీసీ

Leave A Reply

Your Email Id will not be published!