Revanth Reddy : మోసం కేసీఆర్ నైజం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : కోడంగ‌ల్ – బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఘ‌నుడు అని మండిప‌డ్డారు.

Revanth Reddy Comments on KCR

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శుక్ర‌వారం కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా బొంరాస్ పేట‌లో రోడ్ షో చేప‌ట్టారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌లేద‌ని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

త‌మ హ‌యాంలోనే బొంరాస్ పేట డెవ‌ల‌ప్ అయ్యింద‌న్నారు. వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేస్తామ‌న్నార‌ని కానీ ఇప్పటి దాకా దాని ఊసెత్త‌డం లేద‌న్నారు . తీసుకొస్తామ‌న్న కృష్ణా జ‌లాలు ఏడ ఉన్నాయో చెప్పాల‌న్నారు.

ప‌దేళ్ల కాలంలో ఫామ్ హౌస్ లోనే నిద్ర పోయిండ‌ని, ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌చివాల‌యానికి వెళ్ల లేద‌ని ఇలాంటి సీఎం మ‌న‌కు అవ‌స‌ర‌మా అని అన్నారు. పోయే కాలం వ‌చ్చింద‌ని ఇక మోసం ఆయ‌న నైజం అంటూ సెటైర్ వేశారు.

Also Read : Rahul Gandhi : కాంగ్రెస్ సూప‌ర్ కారు పంక్చ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!