Revanth Reddy : ఎర్ర‌బెల్లి వ‌ల్ల‌నే జైలుకు వెళ్లా

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ కు చెందిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. త‌న వ‌ల్ల‌నే తాను ఆనాడు నోటుకు ఓటు కేసులో జైలుకు వెళ్ల‌డం జ‌రిగింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఎర్ర‌బెల్లిని ఓడించ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త 20 ఏళ్లుగా తాను రాజ‌కీయ రంగంలో ఉన్నాన‌ని, ఎవ‌రు ఏమిట‌నేది త‌న‌కు బాగా తెలుస‌న్నారు.

Revanth Reddy Comments on Yerrabelli

బీఆర్ఎస్ ప‌ని అయి పోయింద‌న్నారు. ఇక ఎర్ర‌బెల్లి ఎన్ని వేషాలు వేసినా, పాల‌కుర్తిలో ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). త‌న‌కు సీఎం కేసీఆర్ అండ ఉంద‌ని అనుకుంటున్నాడ‌ని కానీ తాము అధికారంలోకి రాగానే వెంట‌నే క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని జైల్లో వేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇవాళ ఎంతో మంది కుటుంబాలు రోడ్డున ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌కులు ఈ క‌ల్వ‌కుంట్ల కాల‌కేయుల‌ని ఆరోపించారు. వీరి భ‌ర‌తం ప‌ట్టేందుకే తాను త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు.

పాల‌కుర్తిలో త‌మ పార్టీ అభ్య‌ర్థిని నామినేష‌న్ వేసిన సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించారు రేవంత్ రెడ్డి. భారీ ఎత్తున ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా త‌ర‌లి వ‌చ్చారు. ప్ర‌జా స్పంద‌న చూస్తుంటే ప్ర‌భుత్వం ప‌ట్ల ఎంత వ్య‌తిరేకంగా ఉన్నారో అర్థ‌మ‌వుతుంద‌న్నారు .

Also Read : Mallu Bhatti Vikramarka : గెలిపిస్తే సీఎంను అవుతా – భ‌ట్టి

Leave A Reply

Your Email Id will not be published!