Shabbir Ali : త్వ‌ర‌లో ప‌ద‌వుల పందేరం

ప్ర‌క‌టించిన ష‌బ్బీర్ అలీ

Shabbir Ali : హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ కీల‌క దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈనెల 7న ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వ‌ర్యంలో గాంధీ భ‌వ‌న్ లో సీఎం, మంత్రుల‌తో టీపీసీసీ పీఏసీ స‌మావేశం ముగిసింది. ఈ మీటింగ్ కు సంబంధించి తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ.

Shabbir Ali Comment

ఈ కీల‌క మీటింగ్ లో మూడు నిర్ణ‌యాలకు స‌మావేశం ఆమోదం తెలిపింద‌న్నారు. ఇందులో భాగంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌కు ప్ర‌జ‌లు ఆమోదం తెలిపార‌ని , ఇందుకు గాను ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు పార్టీ ప‌రంగా తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సీపీపీ చైర్మ‌న్ సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎక్క‌డో ఒక చోట లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని తీర్మానం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క అప్ డేట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ష‌బ్బీర్ అలీ(Shabbir Ali).

త్వ‌ర‌లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నార‌ని, పార్టీ కోసం ఇన్నాళ్ల పాటు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికి ఇందులో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. దీంతో ఆశావాహుల జాబితాతో సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

Also Read : MPs Suspended : ప్ర‌తిప‌క్ష ఎంపీలపై స్పీక‌ర్ వేటు

Leave A Reply

Your Email Id will not be published!