హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు విల విల లాడింది రాజస్థాన్. నిన్నటి దాకా పరుగుల వరద పారించిన బ్యాటర్లు చేతులెత్తేశారు. బంతులను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడ్డారు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు ప్రఫుల్ హింగే. మిస్సైల్స్ లాంటి బంతులతో హోరెత్తించాడు. తొలి ఓవర్ లోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. దెబ్బకు కుదేలైంది. అంతే కాదు ఏకంగా అరుదైన రికార్డ్ సృష్టించాడు ప్రఫుల్ హింగే. మరో వైపు సకీబ్ నాలుగు వికెట్లతో హోరెత్తించాడు.
తన తొలి ఓవర్ లోనే ప్రఫుల్ వండర్ చేశాడు. రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. స్టార్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని బోల్తా కొట్టించాడు. ధ్రువ్ జురేల్, ప్రిటోరియస్ లను పెవిలియన్ పంపించాడు. మరో వైపు సకీబ్ హుస్సేన్ సైతం కళ్లు చెదిరే బంతులతో షాక్ ఇచ్చాడు. దీంతో 9 పరుగులకే 5 కీలకమైన వికెట్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. చివరకు పరువు పోకుండా కాపాడారు ప్లేయర్స్ ఫెరీరా, రవీంద్ర జడేజా. అంతకు ముందు హైదరాబాద్ 217 రన్స్ చేసింది. ఫ్రఫుల్ హింగే 34 రన్స్ ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. నకీబ్ హస్సన్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇషాన్ కిషన్ సూపర్ షో చేశాడు. తను 44 బాల్స్ ఎదుర్కొని 91 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
