భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

పీసీబీని కోరిన శ్రీ‌లంక క్రికెట్ బోర్డు

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ మేర‌కు అనుమతి ఇచ్చేది లేదంటూ ఆయా దేశాల అధ్య‌క్షుడు యూనుస్, షెహ‌బాజ్ ష‌రీలు ప్ర‌క‌టించారు. దీంతో ఐసీసీ సీరియ‌స్ అయ్యింది. చివ‌ర‌కు ఆ రెండు టీమ్ ల‌ను నిషేధించే ఆలోచ‌న‌లో ఉంది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీమిండియాతో ఆడే విష‌యంలో పాకిస్తాన్ పున‌రాలోచించాల‌ని ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను కోరింది. పునః ప‌రిశీలించాల‌ని సూచించింది.

శ్రీలంక క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తిగా ఉందని స్ప‌ష్టం చేసింది. శ్రీలంకలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని వాణిజ్య, కార్యాచరణ, లాజిస్టికల్ , భద్రతా సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆతిథ్య ఏర్పాట్లు, టిక్కెట్ల అమ్మకాలు కూడా పూర్తయ్యాయని ధృవీకరించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్ ను బ‌హిష్క‌రించాల‌ని పీసీబీ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసింది శ్రీ‌లంక క్రికెట్ బోర్డు. ఈ చ‌ర్య వ‌ల్ల భారీ ఎత్తున వాణిజ్య‌, వ్యాపార ప‌రంగా భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని పేర్కొంది. ఏ ఒక్క‌రికి ఇబ్బంది లేకుండా తాము ఏర్పాట్లు చేశామ‌ని తెలిపింది.

Leave A Reply

Your Email Id will not be published!