Udhayanidhi Stalin : ఉదయనిధిపై సీజేఐకి ఫిర్యాదు
262 మంది ప్రముఖులు సుదీర్ఘ లేఖ
Udhayanidhi Stalin: న్యూఢిల్లీ – సనతాన ధర్మం అత్యంత ప్రమాదకరమని, అది డెంగ్యూ, మలేరియా లాంటిదని సంచలన కామెంట్స్ చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. తాజాగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ప్రముఖ పౌరులు సుదీర్ఘ లేఖ రాశారు.
Udhayanidhi Stalin Viral
లేఖ రాసిన వారిలో ఢిల్లీ హైకోర్టు మాజీ జస్టిస్ ఎస్ఎన్ థింగ్రా కూడా సంతకం చేసిన వారిలో ఉన్నారు. మంత్రి పదవిలో ఉన్న ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) పౌరుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని, చర్యలు తీసుకోవాలని కోరారు.
భారత దేశ రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఆయన మాట్లాడారని, ఇది లౌకిక స్వభావాన్ని దెబ్బ తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 250 మందికి పైగా ప్రముఖులు సీజేఐకి లేఖ రాసిన వారిలో ఉండడం విశేషం. 14 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 130 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 118 మాజీ సాయుధ దళాల అధికారులతో 262 మంది సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా యూపీలోని అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి స్టాలిన్ తలను నరికి తీసుకు వచ్చిన వారికి రూ.20 కోట్లు బహుమానంగా ఇస్తానని ప్రకటించారు.
Also Read : Bharat Comment : పేరు మారిస్తే ‘భారత్’ బాగుపడుతుందా