Ramdev Baba : ప‌తంజ‌లి బాబాకు కోలుకోలేని షాక్

ఆ ఐదు ఉత్ప‌త్తులు నిలిపి వేయండి

Ramdev Baba : న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక బాబాలు, స్వాములు పెరిగి పోయారు. ప్ర‌ధానంగా బ‌డా కంపెనీల‌కు కోలుకోలేని షాక్ ఇస్తూ వ‌చ్చారు ప్ర‌ముఖ యోగా గురు రాం దేవ్ బాబా. ప‌తంజ‌లి పేరుతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తులు త‌యారు చేస్తూ విక్ర‌యిస్తున్నారు.

వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రుగుతోంది. ఇక ఆ మ‌ధ్యన దేశాన్ని ప‌ట్టి పీడించిన క‌రోనా వ్యాధికి కూడా తాను మందు క‌నిపెట్టిన‌ట్లు అది వాడితే వెంట‌నే త‌గ్గి పోతుంద‌ని ప్ర‌చారం చేశాడు. దీనిపై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ త‌ప్పు ప‌ట్టింది. ఆపై త‌న‌కే క‌రోనా వ‌చ్చి ప‌డితే చివ‌ర‌కు ఆస్ప‌త్రిలో చేరాడు ఈ రాందేవ్ బాబా(Ramdev Baba).

ఈ త‌రుణంలో తాజాగా ప‌లు రోగాల‌కు పతంజ‌లి త‌యారు చేసిన మందులు వాడితే వెంట‌నే త‌గ్గి పోతాయంటూ పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ వ‌స్తున్నాడు రాం దేవ్ బాబా. తాజాగా ఉత్త‌రాఖండ్ ఆయుర్వేద యునానీ ఔష‌ధ నియంత్ర‌ణ మండ‌లి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా మ‌ధు మేమం, గ్లకోమా, థైరాయిడ్ , ర‌క్త పోటు , కొలెస్ట్రాల్ నివార‌ణ‌కు త‌మ ఔష‌ధాలు చ‌క్క‌ని ఫ‌లితాలు ఇస్తాయంటూ ప్ర‌చారం చేశాడు రాం దేవ్ బాబా. ముందు వెంట‌నే ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు నిలిపి వేయాలంటూ ప‌తంజ‌లిని, దాని ఇంఛార్జ్ బాబాను ఆదేశించింది.

ఇప్ప‌టికే ఆయ‌న‌పై ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి. భ‌క్తి పేరుతో, యోగా పేరుతో దందా చేయ‌డం మానుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Also Read : కాషాయంపై ఫైర్ బ్రాండ్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!