Vijaya Shanti : ప‌రామ‌ర్శిస్తే విమ‌ర్శ‌లేలా

కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి

Vijaya Shanti : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు , ప్ర‌ముఖ న‌టి విజ‌య శాంతి కీల‌క కామెంట్స్ చేశారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె స్పందించారు. మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని, ఆయ‌న‌ను త‌మ నాయ‌కులు సంద‌ర్శించి, ప‌రామ‌ర్శిస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు విజ‌య‌శాంతి.

Vijaya Shanti Comment

రాజ‌కీయాల‌లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు స‌ర్వ సాధార‌ణ‌మ‌ని, కానీ మానీయంగా చెప్పాలంటే ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రైనా, ఎంత‌టి వారైనా క‌నీస మ‌ర్యాద పూర్వ‌కంగా ప‌ల‌క‌రించ‌డం త‌ప్ప‌ద‌న్నారు. దీనిని కూడా బీఆర్ఎస్ నేత‌లు , వారి అనుయాయులు, అనుచ‌రులు త‌ప్పుగా కామెంట్స్ చేస్తూ ఉండ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు.

ఆరోగ్యక‌ర‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య‌శాంతి(Vijaya Shanti). త‌మ నాయ‌కుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే క‌నీసం కంగ్రాట్స్ కూడా చెప్ప‌లేదంటూ కేసీఆర్ ను ఎద్దేవా చేసింది. అయితే ఇదే స‌మ‌యంలో త‌న‌ను ఎంత‌గా విమ‌ర్శించినా, ఆరోప‌ణ‌లు చేసినా అవేవీ మ‌న‌సులో పెట్టుకోకుండా సీఎం అయిన వెంట‌నే , విష‌యం తెలుసుకున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప‌రామ‌ర్శించార‌ని ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని అన్నారు విజ‌య‌శాంతి.

Also Read : Kothakota Srinivas Reddy : డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం – సీపీ

Leave A Reply

Your Email Id will not be published!