YSRCP MP : వైసీపీకి మరో షాక్..వరుస నాయకుల రాజీనామాలు..గందరగోళంగా ఉన్న ఏపీ..

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

YSRCP MP : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మార్చి 16న టీడీపీలో చేరనున్నారు.ఆయనతో పాటు ఆయన కుమారుడు రాఘవ రెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకొనున్నారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ చంద్రబాబు సమక్షంలో మాగుంట కుటుంబ సభ్యులు టీడీపీలోకి రానున్నారు. కాగా, శ్రీనివాసులు రెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట చేరికతో టీడీపీ మరింత బలపడుతుందని ఆ పార్టీలోనే భావిస్తున్నారు.

YSRCP MP Resign Viral

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ఆయన స్థానంలో తనయుడు రాఘవరెడ్డిని తీసుకోనున్నట్లు ప్రకటించారు. రాఘవరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని టీడీపీ అధిష్టానం ప్రకటిస్తుందని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

Also Read : Bengaluru Bomb Blast : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ లో కీలక మలుపు

Leave A Reply

Your Email Id will not be published!