CM KCR Announce : రేషన్ డీలర్లకు సీఎం ఖుష్ కబర్
కమీషన్ తో పాటు హెల్త్ కార్డులు
CM KCR Announce : ఎన్నికల వేళ ఏది కోరినా ఇచ్చేటట్టుగా ఉన్నారు సీఎం కేసీఆర్. ముందు నుంచి ఆయన భోళా శంకరుడిగా పేరు పొందారు. అంతే కాదు సాహిత్య ప్రేమికుడు, కవి, రచయిత, వక్త, ఉద్యమ నాయకుడిగా పేరు పొందారు. రాదనుకున్న తెలంగాణను తీసుకు వచ్చిన ఘనత కూడా కేసీఆర్(KCR) దే. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్షేమ పథాకలను, కార్యక్రమాలను అమలు చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు.
CM KCR Announce Good News For Ration Dealers
ఈ తరుణంలో పేదలకు రేషన్ ఇవ్వడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు రేషన్ షాపు డీలర్లు. కొన్నేళ్లుగా సర్వీస్ చేస్తున్నారు. వారంతా ప్రస్తుతం తమకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ సరి పోవడం లేదని ఆందోళన చెందారు. ఈ మేరకు పలుమార్లు రాష్ట్ర సర్కార్ తో విన్నవించారు. ఇందులో భాగంగా రేషన్ షాపుల సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ మేరకు చర్చలు ఫల ప్రదం అయ్యాయని సర్కార్ పేర్కొంది.
రేషన్ డీలర్ల కమీషన్ క్వింటాల్ కు రూ. 70 నుంచి రూ. 140కి పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అంతే కాదు రాష్ట్రంలోని ప్రతి రేషన్ షాపు డీలర్ కు , కుటుంబానికి హెల్త్ కార్డులు కూడా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో రేషన్ డీలర్లు ఫుల్ ఖుషీకి లోనవుతున్నారు.
Also Read : Pinnelli Ramakrishna Reddy : లోకేష్ దమ్ముంటే నిరూపించు