AP CM : ఏపీ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

కాగా మరికొద్ది సేపట్లో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు...

AP CM : గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు.

AP CM Comment

కాగా మరికొద్ది సేపట్లో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు(AP CM) పాల్గొననున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో భగవాన్ శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో జరగనున్న గురు పౌర్ణమి వేడుకలకు అతిథిగా వెళ్లనున్నారు. ఇక గురుపౌర్ణమి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. షిరిడీ సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సాయి బాబా ఆలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.

Also Read : Kedarnath Landslides: కేదార్ నాథ్ నడక మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు ! ముగ్గురు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!