KTR Comment : కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో విద్యా రంగాన్ని కుదేలు చేసింది

గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు 34మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు...

KTR : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించటంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు మంచివి కావని హితవుపలికారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

KTR Comments Viral

తెలంగాణలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు 34మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పేదపిల్లలు చనిపోతే కాంగ్రెస్ సర్కార్‌కు పట్టింపే లేదని ధ్వజమెత్తారు. పాలమాకులలో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, గురుకులాల్లో మౌలిక సదుపాయాలపై రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో నాణ్యమైన తిండి పెట్టడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు చదువుతున్నారనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించారు. సీఎం రేవంత్ రెడ్డి బడాయి మాటలు చెప్పడం తప్ప చేతలు మాత్రం లేవని ధ్వజమెత్తారు.

Also Read : Paris Olympics 2024 : రెండవరోజు ఒలింపిక్స్ లో అదరగొట్టిన భారత అథ్లెట్లు

Leave A Reply

Your Email Id will not be published!