Ambati Rambabu : చంద్ర‌బాబుపై అంబ‌టి ఆగ్ర‌హం

తుపాను పేరుతో రాజ‌కీయం చేస్తే ఎలా

Ambati Rambabu  : అమ‌రావ‌తి – ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తుపాను పేరుతో రాజ‌కీయం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు కావాల‌ని త‌మ స‌ర్కార్ పై దుష్ర‌చారం చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

Ambati Rambabu Slams Chandrababu

ప్ర‌తి సంక్షోభాన్ని రాజ‌కీయాల కోసం వాడుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు టీడీపీ చీఫ్ ను క్షమించ‌ర‌ని పేర్కొన్నారు అంబ‌టి రాంబాబు(Ambati Rambabu ). సీఎం జ‌గ‌న్ ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డం పేరుతో పాలిటిక్స్ ఎలా అని ప్ర‌శ్నించారు.

ఆదివారం అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. గ‌తంలో త‌న హ‌యాంలో చోటు చేసుకున్న తుఫాన్ల‌లో ఎంత మందిని ఆదుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు అంబ‌టి రాంబాబు. చంద్ర‌బాబు నాయుడులా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌చారం చేసుకోవ‌డం ఇష్టం ఉండ‌ద‌న్నారు.

ఈ రాష్ట్రంలో కొత్త‌గా ప్రాజెక్టుల‌ను క‌ట్టించిన చ‌రిత్ర దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఉంద‌ని, చంద్ర‌బాబు నాయుడుకు లేద‌న్నారు. ఆయ‌న వ‌ల్ల రాష్ట్రం ప‌దేళ్లు వెనక్కి పోయింద‌న్నారు. చంద్ర‌బాబు నిర్వాకం కార‌ణంగా ప్ర‌జ‌లు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు అంబ‌టి రాంబాబు.

Also Read : Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఓవైసీ ముచ్చ‌ట‌

Leave A Reply

Your Email Id will not be published!