Chandra Babu Naidu : అంగ‌న్ వాడీల‌కు బాబు భ‌రోసా

జ‌గ‌న్ పాల‌న అస్త‌వ్య‌స్తం

Chandra Babu Naidu : కుప్పం – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu) నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌స్తుతం కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. నూత‌న కార్యాల‌యంలో పూజ‌లు కూడా చేశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చంద్ర‌బాబులో భ‌క్తి భావం పెంపొందింది.

Chandra Babu Naidu Assurance to Anganwadis

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు అపూర్వ‌మైన ఆద‌రణ ల‌భిస్తోంది. ఈ సంద‌ర్బంగా అప‌రిష్కృతంగా ఉన్న త‌మ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ గ‌త కొన్ని రోజుల నుంచి ఏపీలోని అంగ‌న్ వాడీలు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కుప్పంలో ధ‌ర్నాకు దిగిన వారి వ‌ద్ద‌కు వెళ్లారు చంద్ర‌బాబు నాయుడు.

ఈ సంద‌ర్భంగా బాబుతో అంగ‌న్ వాడీలు భేటీ అయ్యారు. త‌మ‌ను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మోసం చేశాడ‌ని, ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, వేత‌నాలు పెంచుతామ‌ని హామీ ఇచ్చార‌ని వాపోయారు. కానీ ఇచ్చిన మాట‌ను త‌ప్పార‌ని , త‌మ ప‌రిస్థితి దారుణంగా ఉందంటూ మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు అంగ‌న్ వాడీల‌కు భరోసా ఇచ్చారు. మూడు నెల‌లు ఆగితే త‌మ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, మీ అంద‌రి స‌మ‌స్య‌లు తాను ప‌రిష్క‌రిస్తాన‌ని అన్నారు .

Also Read : Pawan Kalyan : జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యం

Leave A Reply

Your Email Id will not be published!