#FlipKartShops : కిరాణా దుకాణాలపై కన్నేసిన ఫ్లిప్ కార్ట్

ఇండియాలో మాత్రం ఈ కామర్స్ బిజినెస్ మాత్రం దూసుకు వెళుతోంది. ఇటు ఆఫ్ లైన్ లోను ..అటు ఆన్ లైన్ లో వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే అమెజాన్, స్నాప్ డీల్ , ఫ్లిప్ కార్ట్ కంపెనీలు ఈ కామర్స్ రంగంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి.

భారతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా ఇండియాలో మాత్రం ఈ కామర్స్ బిజినెస్ మాత్రం దూసుకు వెళుతోంది. ఇటు ఆఫ్ లైన్ లోను ..అటు ఆన్ లైన్ లో వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే అమెజాన్, స్నాప్ డీల్ , ఫ్లిప్ కార్ట్ కంపెనీలు ఈ కామర్స్ రంగంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ మూడు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ దేశీయ కంపెనీలు కాగా అమెజాన్ మాత్రం అమెరికా దేశానికి చెందింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియాపై కన్నేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కంట్రీగా భారత దేశం ఉండడంతో అన్ని కంపెనీలు ఇటు వైపు చూస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఇండియన్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిస్తూ రోజు రోజుకు సరి కొత్త నిర్ణయాలతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది రిలయన్స్ కంపెనీ. తాజాగా డిజిటల్ , ఈ కామర్స్ బిజినెస్ రంగంలోకి ఎంటర్ అవుతున్నట్లు కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ , టాయిస్ , ఫ్యాషన్ , దుస్తుల రంగాలలోకి ప్రవేశించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మార్కెట్ షేక్ కు గురైంది. షేర్స్ పెరిగాయి. ఇదిలా ఉండగా మరో సంచలనానికి తెర తీసింది రిలయన్స్. అదేమిటంటే చిరు దుకాణాలతో టై అప్ కావాలని నిర్ణయం తీసుకుంది. టెలికాం రంగంలో రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ కంపెనీ గ్రామీణ ఆర్ధిక రంగంపై ద్రుష్టి సారించింది. దీంతో ఈ కామర్స్ రంగంలో ఇప్పటికే స్పెస్ స్వంతం చేసుకున్న ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ , స్నాప్ డీల్ కంపెనీలు బిగ్ నెట్ వర్క్ కలిగిన కిరాణ దుకాణాలతో అనుసంధానం కావాలని ప్లాన్ చేశాయి.

దీని వల్ల సమయంతో పాటు ఆదాయం సమకూరుతోందని భావిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ కంపెనీ 27,000 వేల కిరాణ దుకాణాలతో టై అప్ కావాలని డిసైడ్ అయ్యింది. 700 సిటీస్ లలో భాగస్వామ్యం ఏర్పరుచుకోనుంది. రిలయన్స్ జియో ఇప్పటికే వీటితో సంప్రదింపులు ప్రారంభించింది. బిగ్ బిలియన్ డీల్ పేరుతో ప్రోడక్ట్స్ అమ్మెందుకు రెడీ అవుతోంది . ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ను అమెరికా కు చెందిన వాల్ మార్ట్ చేజిక్కించుకుంది. వీటన్నిటికీ డిజిటల్ టెక్నలాజిని వాడుతోంది ఈ కంపెనీ. భారత దేశంలో వ్యాపారం మొత్తం కిరాణా షాప్స్ లలో నడుస్తోంది. అందుకే వీటితోనే వ్యాపారం చేయాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ సీఇఓ కళ్యాణ్ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మొత్తం మీద ఇప్పటికే కునారిల్లి పోయి, వ్యాపారం నత్త నడకన నడుస్తున్న కిరణాదారులకు దిగ్గజ కంపెనీల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉందన్న మాట.

No comment allowed please