Gidugu Rudra Raju : ద‌ర్శి ఘ‌ట‌న సిగ్గు చేటు – రుద్ర‌రాజు

ద‌ళిత వితంతువుపై దారుణం

Gidugu Rudra Raju : ఏపీ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో ద‌ళిత కులానికి చెందిన వితంతువుపై జ‌రిగిన అమానుష‌మైన దాడి దారుణ‌మ‌న్నారు. రాష్ట్ర మంత‌టా 77వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతుంటే మ‌హిళ‌ను దారుణంగా హింసించ‌డం, బంధించడం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ప్ర‌జాస్వామ్యానికి మాయ‌ని మ‌చ్చ గిడుగు రుద్ర‌రాజు పేర్కొన్నారు.

Gidugu Rudra Raju Comments

దీనిపై ప్ర‌భుత్వం మ‌రింత త్వ‌ర‌గా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. బాధిత కుటుంబీకుల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు గిడుగు రుద్ర‌రాజు(Gidugu Rudra Raju). ద‌ళితులు, మైనార్టీల‌పై దాడుల‌ను ఉపేక్షించేది లేద‌ని ఆయ‌న హెచ్చిరించారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా కాంగ్రెస్ క‌మిటీ బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తుంద‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో పోలీసులు స‌కాలంలో స్పందించి బాధిత యువ‌తి ప్రాణాల‌ను కాపాడ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు ఏపీసీసీ చీఫ్‌.

దీనిపై ప్రభుత్వం మరింత మెరుగ్గా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాధిత కుటుంబీకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులు, మైనారిటీలపై దాడులను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తుందని వెల్లడించారు. అదే విధంగా పోలీసులు సకాలంలో స్పందించి బాధిత యువతి ప్రాణాలు కాపాడిన తీరుపై రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు.

Also Read : Vangaveeti Radha : వంగవీటి రాధా పెళ్లి ఫిక్స్

Leave A Reply

Your Email Id will not be published!