IND vs ENG 3rd ODI : మూడో వ‌న్డేలో గెలిచేది ఎవ‌రో

ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ లో గెలుపు

IND vs ENG 3rd ODI : ఇంగ్లండ్ టూర్ లో భాగంగా భార‌త‌, ఇంగ్లండ్ జ‌ట్ల(IND vs ENG 3rd ODI) మ‌ధ్య కీల‌క‌మైన మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ వ‌న్డే మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని నమోదు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.

ఇక రెండో వ‌న్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ 100 ప‌రుగుల తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో ఇవాళ కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలిస్తే ఆ జ‌ట్టే వ‌న్డే సీరీస్ కైవ‌సం చేసుకుంటుంది.

ఇదిలా ఉండ‌గా రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ భార‌త్ ను దెబ్బ కొట్టింది. ఇక టి20 సీరీస్ ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠ పెరిగింది.

ఇక ఇవాల్టి జ‌రిగే మ్యాచ్ లో అమీ తుమీ తేల్చుకునేందుకు ఇరు జ‌ట్లు స‌న్న‌ద్ద‌మ‌య్యాయి. గ‌తంలో ఆడిన జ‌ట్టునే కొన‌సాగించ‌నుంది భార‌త జ‌ట్టు .

ఇదే స‌మ‌యంలో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ ఆడుతాడా లేదా అన్న‌ది అనుమాన‌మే. ఇప్ప‌టికే బీసీసీఐ రెస్ట్ పేరుతో మెల మెల్ల‌గా ఈ స్టార్ ఆట‌గాడిని ప‌క్క‌న పెట్టేస్తూ వ‌స్తోంది.

విండీస్ లో పర్య‌టించే భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన స్థానం నుంచి కోహ్లీని త‌ప్పించింది బీసీసీఐ. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మొత్తం మీద విరాట్ కోహ్లీ రాణిస్తే ఓకే లేదంటే ఇబ్బందే.

Also Read : సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్ కు చేరిన సింధు

Leave A Reply

Your Email Id will not be published!