MP Vijay Sai Reddy : ముసుగు తొలగిస్తే మంచిది – విజ‌య సాయి

విప‌క్షాల‌పై విరుచుకు ప‌డిన వైసీపీ ఎంపీ

MP Vijay Sai Reddy : వైఎస్సార్ సీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. ప‌దే ప‌దే త‌మ పార్టీ చీఫ్‌, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. క‌డుపులో క‌త్తులు పెట్టుకుని కౌగిలించుకునే బ‌దులు ఎవ‌రికి వారే ప్ర‌జా క్షేత్రంలోకి వెళితే ఎవ‌రి బ‌లం ఏమిటో తెలిసి పోతుంద‌న్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌చ్చ బ్యాచ్ కు బాగా అల‌వాటైంద‌ని ఎద్దేవా చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ముసుగు తీస్తే ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటు వేయాలనేది నిర్ణ‌యించు కుంటార‌ని తెలిపారు.

ఎన్ని వ్యూహాలు ప‌న్నినా, ఎంత‌గా ఆరోప‌ణ‌లు చేసినా, విమ‌ర్శ‌లు గుప్పించినా జ‌నం జ‌గ‌న్ వైపు ఉన్నార‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. గ‌తంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా తమ నాయ‌కుడు ఇచ్చిన హామీల‌ను 99 శాతం అమ‌లు చేశార‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి(MP Vijay Sai Reddy). కేవ‌లం ఒక్క శాతం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నారు. ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని కానీ విప‌క్షాల‌కు ఇదేదీ క‌నిపించ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

ఇవాళ త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన నాడు నేడు కార్య‌క్ర‌మం దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా మారింద‌ని గుర్తు చేశారు. లెక్క‌ల కొద్ది కంపెనీలు ఇవాల ఏపీతో ఒప్పందం చేసుకున్నాయ‌ని త్వ‌ర‌లోనే ఏర్పాట‌వుతాయ‌ని పేర్కొన్నారు. ఇక‌నైనా ముసుగు తొల‌గిస్తే బావుంటుంద‌ని సెల‌విచ్చారు.

Also Read : YS Sharmila KCR : దొంగ‌ల‌కు తాళ‌లిచ్చిన దొర – ష‌ర్మిల‌

Leave A Reply

Your Email Id will not be published!