YS Sharmila KCR : దొంగ‌ల‌కు తాళ‌లిచ్చిన దొర – ష‌ర్మిల‌

సీఎం కేసీఆర్ పై సంచ‌ల‌న కామెంట్స్

YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆదివారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఎమ్మేల్యేలు రాబందుల‌ని గ‌తంలో చెప్పిన సీఎం కేసీఆర్ తిరిగి వాళ్ల‌కే ప‌వ‌ర్స్ క‌ట్టెబెట్టారంటూ మండిప‌డ్డారు. దీంతో ఆయ‌న ఎవ‌రి ప‌క్ష‌మో తెలిసి పోయింద‌ని పేర్కొన్నారు. ఎవ‌రెంత తిన్నారో త‌న వ‌ద్ద లెక్కలు ప‌క్కాగా ఉన్నాయ‌ని చెప్పిన దొర ఎందుకు మాట మార్చారో చెప్పాలంటూ నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిల‌.

ఇప్ప‌టికే అధికారాన్ని అడ్డం పెట్ట‌కుని లూటీ చేసిన దొర ఇప్పుడు మ‌ళ్లీ అక్ర‌మార్కుల‌కు ప‌చ్చ జెండా ఊప‌డం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. అర్హుల ఎంపిక నిర్ణ‌యం ఎమ్మెల్యేల‌కు ఇస్తే ఎలా అని నిల‌దీశారు. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని క‌మీష‌న్ల బంధు అంటూ ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 11 మంది మందిని ఎంపిక చేస్తార‌ని, ఒక్కో ఎమ్మెల్యే క‌నీసం సగం క‌మీష‌న్ తీసుకున్నా దాదాపు రూ. 55 కోట్ల దాకా అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 100 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి లెక్కిస్తే రూ.6,000 కోట్లు అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు వైఎస్ ష‌ర్మిల‌. పేరుకు ద‌ళిత బంధు ఈ సొమ్మంతా రాబోయే ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టేందుకు ప్లాన్ చేశాడ‌ని ఆరోపించారు. క‌మీష‌న్లు కొట్టండి ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టండి అనేది దొర బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని ఎద్దేవా చేశారు. ద‌ళిత బంధు ఎంపిక‌లో ఎమ్మెల్యేల‌ను లేకుండా చేయాల‌ని ఆమె కోరారు.

Also Read : Satya Pal Malik : నా ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేది – స‌త్య పాల్

Leave A Reply

Your Email Id will not be published!