Nara Lokesh : ఆధారాలు లేకుండా విచారిస్తే ఎలా
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : అమరావతి – అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో తనను ఏపీ సీఐడీ విచారణ చేపట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
దాదాపు ఆరున్నర గంటల పాటు స్కాంతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని ఆరోపించారు నారా లోకేష్. మొత్తం 50 ప్రశ్నలకు గాను ఇందులో49 ప్రశ్నలకు జవాబులు గూగుల్ లో వెతికితే దొరికేవనని పేర్కొన్నారు.
Nara Lokesh Comment Viral
మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వం లో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారంటూ చిల్లర ప్రశ్నలు వేశారంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్(Nara Lokesh). ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షమైనా, ప్రజల నైనా కక్ష సాధించడం అలవాటుగా మారిందని ఆరోపించారు.
పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని, యువతకి ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదని నిలదీసినందుకే ఆధారాలు లేని కేసులో అక్రమ అరెస్టు చేసి చంద్రబాబుని జైలులో వేశారన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనన్నారు.
తాను యువగళం పాదయాత్ర ద్వారా అరాచక సర్కారుపై ప్రజల్ని చైతన్య పరుస్తుంటే…ఇదిగో ఇలా తప్పుడు కేసుతో యువగళం ఆగి పోయేలా చేశారని మండిపడ్డారు.
Also Read : Telugu Mahasabhalu : జనవరిలో తెలుగు మహాసభలు