Nara Lokesh : జనానికి దిక్కేది అభివద్దికి దారేది
నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : అమరావతి – ఏపీ రాష్ట్రంలో పాలన పడకేసిందని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . యువ గళం పాదయాత్ర 225వ రోజు కు చేరుకుంది. తోటాడ స్మార్ట్ సిటీ నుంచి యాత్రను ప్రారంభించారు లోకేష్(Nara Lokesh). పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్బంగా భరణికం గ్రామవ వద్ద భారీ ఎత్తున స్వాగతం పలికారు .
Nara Lokesh Comments on AP Govt
సిరసపల్లి, వెంకటాపురం, పరవాడ, గొర్లవానిపాలెం, చింతలగొర్లవాని పాలెం, జాజులవాని పాలెం, దేశపట్నూరి పాలెం, స్టీల్ ప్లాంట్ గేటు, సెక్టార్ -10 బస్టాప్, సెక్టార్ – 5 కాంప్లెక్స్ మీదుగా పాదయాత్ర సాగింది.
పరవాడ సంత బయలు వద్ద పంచ గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు నారా లోకేష్. తోటాడ, సిరసపల్లి, వెంకటాపురం గ్రామస్తులు, ఎల్ జి పాలిమర్స్ బాధితులు, పరవాడ గ్రామ డ్వాక్రా మహిళలు, కాపు సామాజిక వర్గీయులు, నిరుద్యోగులు వారి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.
ప్రజలను ఉద్దేశించి నారా లోకేష్ బాబు ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తాము అధికారాంలోకి వస్తామని జోష్యం చెప్పారు.
Also Read : Kothakota Srinivas Reddy : డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి