IND vs SA 1st ODI : అబ్బా భార‌త బౌల‌ర్ల దెబ్బ

8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

IND vs SA 1st ODI : స‌ఫారీల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త జ‌ట్టు. భార‌త బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు స‌ఫారీ బ్యాట‌ర్లు. వ‌న్డే సీరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన తొలి వ‌న్డే(IND vs 1st ODI) మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది టీమిండియా. ఇంకా 200 బాల్స్ మిగిలి ఉండ‌గానే విజ‌యం సాధించ‌డం విశేషం.

IND vs SA 1st ODI Updates

ప్ర‌ధానంగా ఇండియ‌న్ పేస్ బౌల‌ర‌ర్లు అర్ష్ దీప్ సింగ్ , అవేశ్ ఖాన్ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించారు. నిప్పులు చెరిగే బంతుల‌తో దుమ్ము రేపారు. ఒకానొక ద‌శ‌లో ప‌రుగులు లేకుండానే డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో వైపు సాయి సుద‌ర్శ‌న్ తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ తో ఆక‌ట్టుకున్నారు.

ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత జ‌రిగిన తొలి మ్యాచ్ లో విజ‌యం సాధించడం విశేషం. మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది స‌ఫారీ టీమ్. 27.3 ఓవ‌ర్ల‌లో 116 ర‌న్స్ కే ఆలౌటైంది. ఫెలుక్వాయో 33 ర‌న్స్ చేస్తే జోర్డీ 28, మార్క్మ్ 12, షంషీ 11 ప‌రుగులు చేశారు.

అనంత‌రం 117 ర‌న్స్ తో బ‌రిలోకి దిగిన భార‌త్ జ‌ట్టు సునాయ‌సంగా గెలుపొంది. సాయి సుద‌ర్శ‌న్ 55 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిస్తే అయ్య‌ర్ 52 ర‌న్స్ చేశారు. అర్ష్ దీప్ 5 వికెట్లు తీశాడు.

Also Read : Nara Lokesh : జ‌నానికి దిక్కేది అభివ‌ద్దికి దారేది

Leave A Reply

Your Email Id will not be published!