Nara Lokesh : పేద‌ల పెన్నిధి ర‌వ‌న్న – లోకేష్

అణ గారిన వ‌ర్గాల‌కు అండ

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి, దివంగ‌త నేత ప‌రిటాల ర‌వీంద్ర జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళులు అర్పించారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.

Nara Lokesh Tributes were paid to Paritala Ravindra

అరాచ‌క శ‌క్తుల పాలిట సింహ స్వ‌ప్నంగా నిలిచాడ‌ని, త‌న జీవితాంతం పేద‌ల కోసం కృషి చేశార‌ని పేర్కొన్నారు. పేద‌ల పెన్నిధిగా , అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచిన ఆయ‌న జీవితం ఎల్ల‌ప్ప‌టికీ స్పూర్తి దాయ‌కంగా ఉంటుంద‌న్నారు నారా లోకేష్(Nara Lokesh).

ఆయ‌న జ‌యంతి సంద‌ర్బంగా ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నాన‌ని తెలిపారు. అన్యాయాలు, అక్ర‌మాల‌పై కొన ఊపిరి ఉన్నంత వ‌ర‌కు పోరాడిన అరుదైన నాయ‌కుడు ప‌రిటాల ర‌వీంద్ర అని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల హృద‌యాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసిన ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు నారా లోకేష్.

అలాంటి ప్ర‌జా నాయ‌కుడు మ‌ళ్లీ పుట్ట‌డం చాలా అరుదు అని స్ప‌ష్టం చేశారు. దౌర్జ‌న్యాల‌ను, దోపిడీని ఎదిరించాడు. సామాన్యుల‌కు అండ‌గా నిలిచాడు. నిగ్గ‌దీసి నిల‌దీశాడు. ల‌క్ష‌లాది మందికి భ‌రోసా క‌ల్పించిన ప్ర‌జా నాయ‌కుడు ప‌రిటాల ర‌వీంద్ర అని కొనియాడారు నారా లోకేష్. లోకం ఉన్నంత దాకా ప‌రిటాల ర‌వీంద్ర బ‌తికే ఉంటార‌ని పేర్కొన్నారు.

Also Read : Rahul Gandhi : ల‌డ‌ఖ్ పై మోదీవ‌న్నీ అబ‌ద్దాలే

Leave A Reply

Your Email Id will not be published!