Rahul Gandhi : ల‌డ‌ఖ్ పై మోదీవ‌న్నీ అబ‌ద్దాలే

వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ల‌డ‌ఖ్ విష‌యంలో ప్ర‌ధాని చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్దాల‌ని పేర్కొన్నారు. ల‌డ‌ఖ్ లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేద‌ని మోదీ చెప్పార‌ని, అదంతా పూర్తిగా త‌ప్ప‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Rahul Gandhi Slams PM Modi

మ‌న భార‌త భూభాగాన్ని చైనా లాక్కుంద‌ని ల‌డ‌ఖ్ మొత్తానికి తెలుస‌న్నారు. మ్యాప్ విష‌యం సీరియ‌స్ గా ఉంద‌ని, అయితే చైనా నిజంగానే మ‌న భూమిని అక్ర‌మంగా ఆక్ర‌మించుకుంద‌న్న విష‌యం వాస్త‌వ‌మ‌ని త‌న ప‌రిశీల‌న‌లో తేలింద‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు భూమి ఆక్ర‌మించుకున్నా ఎందుకని మౌనం ఇంకా మోదీ వీడ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ప్ర‌ధాన‌మంత్రి కేవ‌లం త‌న ప‌ద‌వి కోసం మాత్ర‌మే ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. కేవ‌లం ప్ర‌చారం చేసుకోవ‌డం, అబ‌ద్దాలు చెప్ప‌డం అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

ఇలా ఎంత కాలం న‌రేంద్ర మోదీ అబ‌ద్దాలు చెప్పుకుంటూ కాలం వెళ్ల దీస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు రాహుల్ గాంధీ.

Also Read : Paritala Ravindra : ప‌రిటాల ర‌వీంద్ర‌ చెర‌గ‌ని ముద్ర‌

Leave A Reply

Your Email Id will not be published!