Priyanka Gandhi : గ‌ద్ద‌ర్ ను మ‌రిచి పోలేను – ప్రియాంక

ఆయ‌న మ‌ర‌ణం బాధాక‌రం

Priyanka Gandhi : ప్ర‌జా వాగ్గేయ‌కారుడు, ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం బాధా క‌ర‌మ‌ని పేర్కొన్నారు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ. ఆదివారం ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలిసి తాను న‌మ్మ‌లేక పోయాన‌ని తెలిపారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

Priyanka Gandhi Tributes to Gaddar

ఆయ‌న దిగ్గ‌జ క‌వి, అద్భుత‌మైన గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అని కొనియాడారు. తాను కూడా ఆయ‌న పాట‌లు, మాట‌ల్ని విన్నాన‌ని పేర్కొన్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఉన్న‌ట్టుండి పీపుల్స్ సింగ‌ర్ ఇక లేర‌ని తెలిసింది. చాలా బాధ‌కు లోన‌య్యాన‌ని తెలిపారు. ఆయ‌న ప్రేమ పూర్వ‌కంగా ప‌లకరించ‌డం త‌న‌ను సంతోష ప‌రిచేలా చేసింద‌న్నారు.

ఆ మ‌ధ్య త‌న ఫ్యామిలీతో క‌లిసి ఢిల్లీలో క‌లుసుకున్నార‌ని ఆ జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ గుర్తుకు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు పీడితుల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల‌, అంత‌కు మించి ప్ర‌జ‌ల ప‌ట్ల క‌రుణ‌, ప్రేమ గొప్ప‌ద‌న్నారు. ఆయ‌న జ్ఞాప‌కాల్లో నిలిచే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు ప్రియాంక గాంధీ.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం గ‌ద్ద‌ర్ చేసిన పోరాటం నిజంగా స్పూర్తి దాయ‌క‌మ‌న్నారు. గ‌ద్ద‌ర్ శ‌క్తివంత‌మైన పాట‌లు ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని కొనియాడారు.

Also Read : CM KCR Gaddar : ప్రజా వాగ్గేయ‌కారుడు గ‌ద్ద‌ర్ – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!