Rahul Gandhi : భార‌త్ న్యాయ యాత్ర‌పై ఫోక‌స్

జ‌న‌వ‌రి 14 నుంచి పాద‌యాత్ర‌

Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ దూకుడు పెంచింది. దేశంలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై దృష్టి సారించింది. ఇప్ప‌టికే ఇండియా కూట‌మిలో ఉన్న పార్టీ మ‌రింత ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Rahul Gandhi Bharat Nyay Yatra Viral

ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర పార్టీకి మ‌రింత బ‌లాన్ని ఇచ్చేలా చేసింది. ప్ర‌త్యేకించి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రెండో విడ‌త పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు రాహుల్ గాంధీ. ఈ మేర‌కు దీనికి భార‌త్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు.

ఈ యాత్ర కొత్త ఏడాది జ‌న‌వ‌రి 14 నుండి మార్చి 20 వ‌ర‌కు కొన‌సాగుతుంది. మ‌ణిపూర్ నుండి ముంబై వ‌ర‌కు యాత్ర చేప‌డ‌తార‌ని ఏఐసీసీ ప్ర‌క‌టించింది. ఈ భార‌త్ న్యాయ్ యాత్ర‌లో 14 రాష్ట్రాలు..85 జిల్లాల‌ల‌ను క‌వ‌ర్ చేస్తారు రాహుల్ గాంధీ.

భార‌త్ న్యాయ్ యాత్రంలో కాంగ్రెస్ అగ్ర నేత‌లు కూడా పాల్గొంటారు. మొత్తం రాహుల్ గాంధీ 6,200 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేప‌డ‌తార‌ని పార్టీ వెల్ల‌డించింది.

Also Read : Revanth Reddy : ప్రైవేట్ యూనివ‌ర్శిటీల నివేదిక ఇవ్వండి

Leave A Reply

Your Email Id will not be published!