Rajinikanth Fans : వైసీపీ కామెంట్స్ రజనీ ఫ్యాన్స్ ఫైర్
క్షమాపణ చెప్పాలని డిమాండ్
Rajinikanth Fans : ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఆయా పార్టీలు నువ్వా నేనా అంటూ మండి పడుతున్నాయి. దివంగత సీఎం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ నటుడు తలైవా రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఎన్టీఆర్ ను, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ను ప్రశంసలతో ముంచెత్తారు. తనకు బాబుకు మధ్య 30 ఏళ్ల మధ్య బంధం ఉందన్నారు.
రజనీకాంత్(Rajinikanth Fans) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తైలవా చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు వైసీపీ నేతలు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఆయన సినిమా రంగంలో స్టార్ కావచ్చు కానీ ఏపీలో కాదని పేర్కొన్నారు. ఏదైనా అభిమానం ఉంటే తన వ్యక్తిగతంగా మాట్లాడాలని ఇలాంటి వేదికలపై కాదని కుండ బద్దలు కొట్టారు.
మరో మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు రజనీకాంత్ పై. తలైవా అంటే నటుడిగా గౌరవిస్తాం కానీ ఒక నటుడిగా కాకుండా ఆయన చిల్లర వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. నటులకు రాజకీయాలు ఉండ కూడదన్నారు. ఒకవేళ తనకు ఇష్టమని అనుకుంటే పార్టీ జెండా కప్పుకుంటే తప్పేమీ లేదంటూ స్పష్టం చేశారు.
Also Read : శ్రీశ్రీ అనంతం ‘మహా ప్రస్థానం’