హైదరాబాద్ : బ్యాంకు ఖాతాదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. ఈ మేరకు ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 1 బుధవారం నుంచి డబ్బుల లావాదేవీలకు సంబంధించి పలు సూచనలు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైంది, దీనితో పాటు పన్ను విధానం, బ్యాంకింగ్, పదవీ విరమణ పొదుపులు, రోజువారీ ఖర్చులకు సంబంధించిన అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి.
కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలుపైనే ప్రధాన దృష్టి ఉన్నప్పటికీ, ఏటీఎం విత్డ్రాలు , ఈపీఎఫ్ వాటాల నుండి పాన్ నియమాలు , ఎల్పీజీ ధరల వరకు అనేక ఇతర ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించనున్నాయి. ఇదంతా ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది సర్కార్. ప్రధానంగా ఆర్థిక నియమాలలో 7 ప్రధాన మార్పులు చేసింది.
ఇవాల్టి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు లోకి వచ్చింది. అత్యంత భారీ నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇటీవల నోటిఫై చేయబడిన ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ ప్రకారం, కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ పాత నిబంధనలను తొలగించింది. మరింత సరళీకృత వ్యవస్థను ప్రవేశ పెట్టడం ద్వారా పన్ను నిబంధనల పాటించడాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం , అసెస్మెంట్ సంవత్సరం అనే విభజన స్థానంలో ట్యాక్స్ ఇయర్ అనే కొత్త పదాన్ని చేర్చింది ఆర్బీఐ.
కొత్త పన్ను విధానమే డిఫాల్ట్ ఎంపికగా కొనసాగుతుంది, తద్వారా తక్కువ మినహాయింపులతో కూడిన ఈ సరళీకృత విధానం వైపు ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులను ఇది ప్రోత్సహిస్తుంది. రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలలో కూడా మార్పులు రానున్నాయి. బ్యాంకులు ఏటీఎం విత్డ్రాయల్ నిబంధనలను సవరిస్తున్నాయి, ఇందులో ఉచిత లావాదేవీల పరిమితులు కఠినతర చేశాయి. ఆపై భారీగా ఛార్జీలు వడ్డిస్తున్నాయి. ఏటీఎంల నుండి యూపీఐ ఆధారిత నగదు విత్డ్రాయల్స్ కూడా ఈ పరిమితుల్లోనే లెక్కించ బడతాయని స్పష్టం చేసింది.
