Revanth Reddy KCR : బెజ‌వాడ‌లో కేసీఆర్ ల్యాండ్ క్రూజ‌ర్లు

ఒక్కొక్క‌టి మూడున్న‌ర కోట్లు

Revanth Reddy : హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 22 ల్యాండ్ క్రూజ‌ర్ల‌ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశాడ‌ని మండిప‌డ్డారు. మూడోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఒక్కోటి మూడున్న‌ర కోట్ల ప్ర‌జా ధ‌నంతో కైవ‌సం చేసుకున్నాడ‌ని ఆరోపించారు.

Revanth Reddy Comments on KCR

భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ల్యాండ్ర క్రూజ‌ర్ల‌ను తెలంగాణ‌లో ఉంచ‌కుండా ఎవ‌రికీ తెలియ‌కుండా దాచి పెట్టాడ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ 22 వెహికిల్స్ ను విజ‌య‌వాడ‌లో దాచి పెట్టాడ‌ని విమ‌ర్శించారు. ఇక్క‌డ ఉంచ‌కుండా వెహికిల్స్ ను ఎందుకు అక్క‌డ ఉంచాల్సి వ‌చ్చిందో చెప్పాల‌ని నిల‌దీశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ విష‌యం తాను తెలుసు కునేందుకు 10 రోజుల స‌మ‌యం ప‌ట్టింద‌ని చెప్పారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌నుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేశాడ‌ని , అన్నింటిని క‌క్కిస్తామ‌ని హెచ్చ‌రించారు.

త్వ‌ర‌లోనే లెక్క‌లు తీస్తామ‌ని, అవినీతిని క‌క్కిస్తామ‌ని, ప్ర‌తి ఒక్క‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగాఈ వెహికిల్స్ క‌థేమిటో త్వ‌ర‌లోనే తెలియ చేస్తాన‌ని అన్నారు.

Also Read : Salaar Box Office : స‌లార్ వ‌సూళ్ల ఊచ‌కోత

Leave A Reply

Your Email Id will not be published!