Congress 2nd List : కాంగ్రెస్ రెండో లిస్టు డిక్లేర్

14 మందితో ప్ర‌క‌ట‌న

Congress 2nd List : న్యూఢిల్లీ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ(Congress) ఎన్నిక‌ల క‌మిటీ శ‌నివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తొలి జాబితాలో 55 మందితో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. తాజాగా మ‌రో 14 మందితో లిస్టును వెల్ల‌డించింది. ఇక ప్ర‌క‌టించిన జాబితాలో నియోజ‌క‌వ‌ర్గాలు, అభ్య‌ర్థుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Congress 2nd List Released

ఉత్కంఠ‌కు తెర దించుతూ స్క్రీనింగ్ క‌మిటీ ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అభ్య‌ర్థిగా మాజీ ఎంపీ మ‌ధు యాష్కి గౌడ్ కే కేటాయించింది. ఇబ్ర‌హీం ప‌ట్నం నుంచి మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, సిరిసిల్ల కు కేకే మ‌హేంద‌ర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది.

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ముఖ యాంక‌ర్ క‌త్తి కార్తీక‌కు ఇవ్వ‌గా ప‌టాన్ చెరు కు కాట శ్రీ‌నివాస్ గౌడ్ ను ఖ‌రారు చేసింది. న‌ర్సాపూర్ లో గాలి అనిల్ కుమార్ , శేరి లింగం ప‌ల్లిలో ర‌ఘునాత్ యాద‌వ్ కు టికెట్ కేటాయించింది. తాండూర్ కు మ‌నోహ‌ర్ రెడ్డి, రాజేంద్ర న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి బొర్ర జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్ కు ఇచ్చింది.

తుంగ‌తుర్తికి అద్దంకి ద‌యాక‌ర్ ను కేటాయించింది. మ‌హేశ్వ‌రంకు పారిజాత న‌ర‌సింహా రెడ్డి, జ‌డ్చ‌ర్ల‌కు అనిరుధ్ రెడ్డి, స‌త్తుప‌ల్లికి పిడ‌మ‌ర్తి ర‌వి, సిద్దిపేట‌కు నీలం మ‌ధు ముదిరాజ్ కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

Also Read : Telangana BJP List : బీజేపీ బీసీల జ‌పం

Leave A Reply

Your Email Id will not be published!