Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – క‌లియుగ దైవంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి . ద‌గ్గ‌రుండి సేవ‌ల తీరును ప‌ర్య‌వేక్షిస్తున్నారు ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి.

Tirumala Rush with Devotees

కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను భావిస్తారు భ‌క్త బాంధ‌వులు. నిన్న ఒక్క రోజు శ‌నివారం శ్రీ‌నివాసుడిని 68 వేల 179 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 29 వేల 726 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

ఇక నిత్యం భ‌క్తులు స్వామి వారికి స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ(TTD) వెల్ల‌డించింది. ఇక స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు తిరుమ‌ల లోని 31 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు.

ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల ద‌ర్శ‌నానికి క‌నీసం 24 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!