Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

హుండీ ఆదాయం రూ. 2.27 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్ర‌సిద్ది చెందిన పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. న‌వ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఈనెల 23 వ‌ర‌కు జ‌రుగుతాయి. ఈ ఉత్స‌వాల‌కు పెద్ద ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి అనుగ్ర‌హం పొందారు.

Tirumala Rush with Devotees

రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు చేప‌ట్టిన‌ట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ(TTD). శ్రీ‌నివాసుడిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 69 వేల 821 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

26 వేల 98 మంది భ‌క్తులు త‌లనీలాలు స‌మ‌ర్పించుకున్నారు. స్వామి వారికి నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.27 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. ఇక స్వామి వారి ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుమ‌ల లోని 8 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం క‌నీసం 6 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి.

Also Read : Smita Sabharwal : అమ్మ స‌న్నిధిలో స్మితా

Leave A Reply

Your Email Id will not be published!