Tulasi Reddy Slams : మోదీ..జ‌గ‌న్ ఇద్ద‌రూ ఒక్క‌టే

ఏపీపీసీసీ మాజీ చీఫ్ తుల‌సీరెడ్డి

Tulasi Reddy Slams : ఏపీ పీసీసీ మాజీ చీఫ్ తుల‌సీ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాయ మాట‌లు చెప్ప‌డంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జ‌గ‌న్ ఆరి తేరారంటూ ఎద్దేవా చేశారు. శుక్ర‌వారం తుల‌సీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువ‌త ఆశల‌పై కేంద్ర ,రాష్ట్ర ప్ర‌భుత్వాలు నీళ్లు చ‌ల్లాయంటూ ఆరోపించారు.

జాబ్స్ భ‌ర్తీ విష‌యంలో సొల్లు క‌బుర్లు చెబుతూ కాలం గ‌డిపారంటూ మండిప‌డ్డారు తుల‌సీ రెడ్డి. దేశ వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల కేంద్ర ప్ర‌భుత్వ జాబ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్ట్ కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు.

ఇక రాష్ట్రంలో రెండున్న‌ర ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని , వీటిని భ‌ర్తీ చేయ‌కుండా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాట‌కాలు ఆడుతున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు తుల‌సీ రెడ్డి(Tulasi Reddy). జ‌గ‌న్ నిర్వాకం కార‌ణంగా ఎవ‌రూ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డం లేద‌న్నారు. ఏసీబీ, పీసీబీ, జేసీబీ ల జోరుతో వ్యాపార‌వేత్త‌లు భ‌య‌ప‌డుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

నిధులు లేని కార‌ణంగా వివిధ కార్పొరేష‌న్లు స్వ‌యం ఉపాధి ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. నెల‌కు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని డిమాండ్ చేశారు తుల‌సీ రెడ్డి.

Also Read : Daggubati Purandeswari : దుర్గ‌మ్మ స‌న్నిధిలో పురందేశ్వ‌రి

 

Leave A Reply

Your Email Id will not be published!