Udhayanidhi Stalin : బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను – ఉద‌య‌నిధి

బీజేపీకి పోయే కాలం ద‌గ్గ‌ర ప‌డింది

Udhayanidhi Stalin : చెన్నై – స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని, డెంగ్యూ, మ‌లేరియా కంటే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) మ‌రోసారి నిప్పులు చెరిగురు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. దేశ వ్యాప్తంగా త‌న త‌ల‌కు వెల క‌ట్టడాన్ని పిరికిపంద‌లు చేసే చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

Udhayanidhi Stalin Comments Viral

తాను ఎందు కోసం అన్నానో తెలుసు కోకుండా హిందూ రూపంలో ఉన్న ఫాసిస్టు మూక‌లు నోరు పారేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ 9 ఏళ్లు పూర్త‌యినా నేటికీ దేశం ప‌ట్ల ఫోక‌స్ పెట్టిన దాఖ‌లాలు లేవ‌ని ఆరోపించారు ఉద‌య‌నిధి స్టాలిన్.

తమ పాల‌న‌లో వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి చ‌వ‌కబారు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం ప‌నిగా పెట్టుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాల‌కు డీఎంకే భ‌య‌ప‌డ‌ద‌ని, అంత‌కు మించి తాను ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న త‌ల‌కు వెల క‌ట్టిన ద‌గుల్భాజీలు ద‌మ్ముంటే త‌న వ‌ద్ద‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. హిందూ మ‌తం పేరుతో మార‌ణ హోమం సృష్టించే మీలాంటి వాళ్ల‌కు కాలం స‌మాధానం త‌ప్ప‌క చెబుతుంద‌న్నారు మంత్రి.

Also Read : Tummala KCR : తుమ్మ‌ల కేసీఆర్ ను మ‌రిచి పోతే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!