Vijayashanti : బీఆర్ఎస్ పై రాములమ్మ గుస్సా

గులాబీ నేత‌లు గ‌మ్ముగ ఉంటే బెట‌ర్

Vijayashanti : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ న‌టి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య శాంతి(Vijayashanti) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌దే ప‌దే గులాబీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. ఆమె మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు గుప్పించి తొమ్మిదిన్న‌ర ఏళ్లుగా పాలించి రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసింది ఎవ‌రో, క‌ల్వ‌కుంట్ల కుటుంబం తెలంగాణ పేరుతో దోచుకున్న వైనం అంతా ద‌గ్గ‌రుండి ప్ర‌జ‌లు చూశార‌ని తెలిపారు. అందుకే గులాబీ నేత‌ల‌ను ఇంటికి పంపించార‌ని ఎద్దేవా చేశారు.

Vijayashanti Comments on BRS

తాము అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన శ్వేత ప‌త్రంకు పేర‌డీగా స్వేద ప‌త్రం రిలీజ్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. అస‌లు తెలంగాణ రాక ముందు క‌ల్వ‌కుంట్ల వారి కుటుంబ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలంగాణ వ‌చ్చాక వారి ఆస్తులు, కోట్లు ఎలా పెరిగాయో ఎన్నిక‌ల అఫిడ‌విట్లు చూస్తే తెలుస్తుంద‌న్నారు.

జాతీయ పార్టీ ప్ర‌క‌టించిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాల‌ని విజ‌య శాంతి డిమాండ్ చేశారు. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో హ‌స్తం హ‌వా కొన‌సాగుతుంద‌ని, కారు టైర్లు పంక్చ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Also Read : PM Modi Record : చ‌రిత్ర సృష్టించిన న‌రేంద్ర మోదీ

Leave A Reply

Your Email Id will not be published!