IND vs WI 2nd T20 : మెకాయ్ దెబ్బ‌కు భార‌త్ విల విల

5 వికెట్ల తేడాతో విండీస్ విక్ట‌రీ

IND vs WI 2nd T20 : హమ్మయ్య ఎట్ట‌కేల‌కు ఆతిథ్య వెస్టిండీస్ జ‌ట్టుకు విక్ట‌రీ ద‌క్కింది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర నిరాశ‌లో ఉన్న ఆ జ‌ట్టుకు అద్భుతం విజ‌యం ఓ టానిక్ లా ప‌ని చేసింది.

మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టి20(IND vs WI 2nd T20) సీరీస్ లో భాగంగా జ‌రిగిన తొలి మ్యాచ్ లో ప‌రాజ‌యం మూట‌గట్టుకుంది.

139 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయ‌సంగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి వికెట్ కు మేమ‌ర్స్ , నికోల‌స్ పూర‌న్ క‌లిసి 46 ప‌రుగులు చేశారు. పాండ్యా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ వీరిద్ద‌రినీ ఔట్ చేశారు.

హెట్ మైర్ ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో చిక్కాడు. కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక విండీస్ ఓపెన‌ర్ గా వ‌చ్చిన బ్రెండెన్ కింగ్ హాఫ్

దుమ్ము రేపాడు.

భార‌త జ‌ట్టు బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. 52 బంతులు ఎదుర్కొన్న కింగ్ 8 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. 68 ప‌రుగులు చేశాడు. చివ‌ర‌కు ఆవేశ్ ఖాన్ బంతికి బౌల్డ్ అయ్యాడు.

చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఈ మ్యాచ్ . 19వ ఓవ‌ర్ల్ లో వ‌చ్చిన అర్ష్ దీప్ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. దాంతో 20వ

ఓవ‌ర్ లో 10 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది విజ‌యానికి.

ఓడియ‌న్ స్మిత్ ఫ్రీ హిట్ ను సిక్స‌ర్ గా మ‌లిచాడు. ఆపై ఫోర్ కొట్ట‌డంతో విండీస్ శుభారంభం చేసింది ఈ సీరీస్ ను. అంత‌కు ముందు 19.4

ఓవ‌ర్ల‌లో టీమిండియా 138 ప‌రుగులకు ఆలౌటైంది.

రోహిత్ శ‌ర్మ సున్నాకే వెనుదిరిగితే సూర్య కుమార్ 11, అయ్య‌ర్ 10 ప‌రుగులు చేసి నిరాశ ప‌రిచారు. పంత్ 24, పాండ్యా 31, జ‌డేజా 27 ర‌న్స్ చేసి రాణించారు.

ఇక వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు మెకాయ్ . 4 ఓవ‌ర్లు వేసి 17 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇందులో ఒక

మెయిడెన్ కూడా ఉండ‌డం విశేషం.

Also Read : అచింత ష‌యొలీకి మోదీ అభినంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!