RK Roja : చంద్రబాబుకు మాట్లాడే హ‌క్కు లేదు – రోజా

నిరుద్యోగుల‌ను మోసం చేసిన టీడీపీ చీఫ్

RK Roja : ఏపీ రాష్ట్ర యువ‌జ‌న‌, టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా(RK Roja) షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. వాడి వేడిగా సాగుతున్నాయి.

నిరుద్యోగుల‌ను వైసీపీ స‌ర్కార్ మోసం చేస్తోందంటూ టీడీపీ ఆరోపణ‌లు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆర్కే రోజా. అస‌లు రాష్ట్రంలో జాబ్స్ ఇస్తానంటూ మోసం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు.

ఆయ‌న‌కు మాట్లాడే హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న హ‌యాంలో ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో శ్వేత ప‌త్రం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో దేశంలో ఎక్క‌డా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల‌ను క‌ల్పించిన ఘ‌న‌త ఏపీలోనే ఉంద‌న్నారు.

మిగ‌తా రాష్ట్రాలు త‌మ‌ను చూసి నేర్చుకుంటున్నాయ‌ని చెప్పారు రోజా. ఇప్ప‌టికే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించామ‌ని, ద‌శ‌ల వారీగా ఉద్యోగాల నియామ‌కం కొన‌సాగుతోంద‌న్నారు.

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ముందు నుంచీ చంద్ర‌బాబుకు అల‌వాటేన‌ని మండిప‌డ్డారు. స‌మావేశాల‌కు ముందు టీడీపీ చీఫ్ చేస్తున్న నిర‌స‌న‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న‌కు ప్ర‌జ‌ల ప‌ట్ల‌, నిరుద్యోగుల ప‌ట్ల ఏ మాత్రం గౌర‌వం లేద‌న్నారు ఆర్కే రోజా(RK Roja). ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకోవ‌డం ఏం సంప్ర‌దాయ‌మ‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌లు అందుకే క‌ర్ర కాల్చి వాత పెట్టార‌ని అయినా బాబుకు బుద్ది రాలేద‌న్నారు. ప్ర‌జా సంక్షేమం కంటే రాజ‌కీయం చేయ‌డంలోనే ఎక్కువ ఫోక‌స్ పెడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇక‌నైనా ప్రజాస్వామ్య బ‌ద్దంగా న‌డుచుకుంటే బెట‌ర్ అని సూచించారు మంత్రి.

Also Read : ప‌ద‌వి..ప‌వ‌ర్ లేకుంటే బాబు ఉండ‌లేడు

Leave A Reply

Your Email Id will not be published!