KC Venugopal : కేసీ వేణుగోపాల్ కు మేడం పిలుపు

సంస్థాగ‌త నిర్మాణాల‌పై ఫోక‌స్

KC Venugopal : కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న ఏకైక పేరు కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). సోనియా గాంధీ ఫ్యామిలీలో ఆయ‌న అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడిగా ఉన్నారు.

రాహుల్ గాంధీ ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర‌లో ఆయ‌న వెంట ఉన్నారు. కానీ ఉన్న‌ట్టుండి ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ నుంచి అర్జెంట్ కాల్ రావ‌డంతో హుటా హుటిన ఢిల్లీకి వెళ్లారు.

సెప్టెంబ‌ర్ 7న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమ‌రి నుంచి యాత్రకు శ్రీ‌కారం చుట్ట‌గా ఆనాటి నుంచి నేటి దాకా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు. సంస్థాగ‌త విష‌యాల‌పై కాంగ్రెస్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది.

ఇందు కోసం రావాల్సిందిగా సోనియా కోరిన‌ట్లు స‌మాచారం. దీంతో కేసీ వేణుగోపాల్(KC Venugopal) హుటా హుటిన యాత్ర నుంచి వెళ్లి పోయారు. అంత వ‌ర‌కు ఆయ‌న కేర‌ళ‌లో రాహుల్ గాంధీతో క‌లిసి అప్పుజా జిల్లాలో ఉన్నారు.

నేటితో ఈ యాత్ర 13 రోజుల‌కు చేరుతుంది. కాంగ్రెస్ నాయ‌కుడు, పార్ల‌మెంట్ స‌భ్యుడు శ‌శి థ‌రూర్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీని క‌లిశారు. త‌న‌కు పోటీ చేసేందుకు చాన్స్ ఇవ్వ‌మ‌ని కోరారు.

దీనికి స‌మ్మ‌తించిన‌ట్లు టాక్. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌లు పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ట్విట్ట‌ర్ వేదికగా. మ‌రో వైపు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను బ‌రిలోకి దించాల‌ని యోచిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

ఈ స‌మ‌యంలో పార్టీ ప‌రంగా ఏం జ‌రుగుతుందోన‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది పార్టీ వ‌ర్గాల‌లో. ఇదే క్ర‌మంలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేసీ వేణుగోపాల్ విధిగా పాల్గొనాల‌ని ఆదేశించ‌డంతో ఢిల్లీకి విచ్చేశారు.

Also Read : అశోక్ గెహ్లాట్ వైపు సోనియా మొగ్గు

Leave A Reply

Your Email Id will not be published!