Lalu Prasad Yadav : త్వ‌ర‌లోనే సోనియాను క‌లుస్తాం – లాలూ

త‌న‌ను క‌లిసిన నితీశ్ కుమార్ తో మాజీ సీఎం

Lalu Prasad Yadav : బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన సీఎం నితీశ్ కుమార్ తో క‌లిసి త్వ‌ర‌లోనే ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియ గాంధీని ఢిల్లీలో క‌లుస్తామ‌ని చెప్పారు.

ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అస‌లైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

చేత గాని పాల‌న‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు మ‌త సామ‌ర‌స్యానికి భంగం క‌లిగించేందుకు య‌త్నిస్తున్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్(Lalu Prasad Yadav) .

అమిత్ షా త్వ‌ర‌లో బీహార్ లో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా అన్ని పార్టీల వారు ప్ర‌ధానంగా ప్ర‌భుత్వంలోని జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, ఇత‌ర నాయ‌కులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకం చేసేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తో పాటు తాను కూడా త్వ‌ర‌లో కాంగ్రెస్ చీఫ్ సోనియాను క‌లుస్తాన‌ని చెప్పారు.

రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్నారు. యాత్ర పూర్త‌య్యాక తాను గాంధీతో మీట్ అవుతాన‌ని తెలిపారు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్.

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప్ర‌తిప‌క్షం బీజేపీని అధికారానికి దూరం చేస్తుంద‌ని జోష్యం చెప్పారు ఆర్జేడీ చీఫ్. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. లాలూ యాద‌వ్(Lalu Prasad Yadav)  చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : పఏఐసీసీ చీఫ్ ఎన్నిక కోసం నోటిఫికేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!