Raj Thackeray : హిందువులు రెచ్చిపోతే త‌ట్టుకోలేరు – రాజ్ ఠాక్రే

మీ మ‌తం స్వీక‌రించి పాకిస్తాన్ కు వెళ్లిపోండి

Raj Thackeray : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయ‌డం మ‌హారాష్ట్రలో క‌ల‌క‌లం రేపింది. దీనిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు మ‌హా న‌వ నిర్మాణ‌ సేన చీఫ్ రాజ్ ఠాక్రే. హిందువులు మూకుమ్మ‌డిగా రెచ్చిపోతే త‌ట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు.

తాము రంగంలోకి దిగితే సీన్ వేరేగా ఉంటుంద‌న్నారు. పుణెలో పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. మీ మ‌తాన్ని స్వీక‌రించి మీకు క‌ష్టం అనిపిస్తే పాకిస్తాన్ కు వెళ్లండి అంటూ నిప్పులు చెరిగారు రాజ్ ఠాక్రే(Raj Thackeray).

న‌న్ను రెచ్చిపోయేలా చేయొద్దంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హిందువులు గ‌నుక చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకుంటే ఏ ఒక్క‌రు మిగ‌ల‌ర‌ని పేర్కొన్నారు.

దీనివ‌ల్ల అశాంతి త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌న్నారు రాజ్ ఠాక్రే. పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

హిందువులు, మ‌రాఠీలు ఈ విష‌యాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటే పండుగ స‌మ‌యంలో అశాంతి ఏర్ప‌డుతుంద‌న్నారు.

త‌క్ష‌ణ‌మే ఈ దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు స్వ‌స్తి పల‌కాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు రాజ్ ఠాక్రే. వారి మాన‌సిక స్థితి దారుణంగా ఉంది.

ఒక‌వేళ వ‌ద్ద‌ని అనుకుంటే మీ మ‌తాన్ని స్వీక‌రించి నిర‌భ్యంత‌రంగా పాకిస్తాన్ కు వెళ్ల‌వ‌చ్చంటూ స్ప‌ష్టం చేశారు. ఇలాంటివి త‌మ దేశంలో అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొన్నారు రాజ్ ఠాక్రే(Raj Thackeray).

వెంట‌నే పాకిస్తాన్ జిందాబాద్ అన్న వారిని ఉపేక్షించ వ‌ద్దంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read : కేర‌ళ మాజీ మంత్రి ఆర్య‌ద‌న్ క‌న్నుమూత‌

Leave A Reply

Your Email Id will not be published!