Eravarthi Anil : ‘ఉత్తమ్’ రియల్ కోవర్ట్ – ఈరవర్తి అనిల్
12 ఎమ్మెల్యేలు మారితే ఏం చేసినవో తెలియదా
Eravarthi Anil : కాంగ్రెస్ పార్టీలో సేవ్ కాంగ్రెస్ పేరుతో సీనియర్ నేతల కామెంట్స్ పై భగ్గుమన్నారు సీనియర్ నాయకుడు ఈరవర్తి అనిల్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రధాన కారకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కారణమని మండిపడ్డారు.
ఆనాడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తనకు టికెట్ రాకుండా గతంలో ఉత్తమ్ ప్రయత్నం చేశాడని కానీ మల్లు భట్టి విక్రమార్క పట్టుపట్టి ఇప్పించారని అన్నారు. గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి వెళ్లేలా చేశాడని ఆరోపించారు అనిల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడటం లేదా అని ప్రశ్నించారు.
జనవరి 26 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని అన్నారు. ఉతమ్ కుమార్ రెడ్డి కుల దురహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. పాడి కౌశిక రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేసి మళ్లీ ఇప్పుడు నీతి వ్యాక్యాలు చెబితే ఎవరు నమ్ముతారని నిలదీశారు ఈరవర్తి అనిల్(Eravarthi Anil) . దళితుడిని సీఎల్పీ కాకుండా ప్రయత్నం చేసింది ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
సీవీ ఆనంద్ చెప్పిన మాటలు తాము ఎలా నమ్ముతామంటూ ప్రశ్నించారు. పదవులు మీకు కేసులు క్యాడర్ కా అని నిలదీశారు. స్వార్థం కోసం ఆనాడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని కానీ ఈనాడు వారికి పదవులు వస్తే తట్టుకోలేక పోతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం అనిల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : దమ్ముంటే నిరూపించండి – రోహిత్ రెడ్డి