Balagam Venu Tirumala : శ్రీ‌వారి సేవ‌లో బ‌ల‌గం వేణు

ర‌చ్చ ర‌వి కూడా ద‌ర్శ‌నం

Balagam Venu Tirumala : న‌టుడు, ద‌ర్శ‌కుడిగా మారిన బ‌ల‌గం మూవీ ద‌ర్శ‌కుడు వేణు తిరుమ‌ల‌ను(Balagam Venu Tirumala) సంద‌ర్శించారు. అక్క‌డ కొలువైన దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. గురువారం ఉద‌యం సుప్ర‌భాత సేవ‌లో శ్రీ‌వారిని, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుక‌న్నారు బ‌ల‌గం వేణు. వేణుతో పాటు జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ ర‌చ్చ ర‌వి కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు బ‌ల‌గం వేణు. త‌న‌కు మొద‌టి నుంచీ దేవుళ్లంటే న‌మ్మ‌క‌మ‌ని పేర్కొన్నారు. ఎక్క‌డా లేని ప్ర‌శాంతంత తిరుమ‌ల‌లో దొరుకుతుంద‌న్నారు. తాను తీసిన బ‌ల‌గం ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొంద‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు బ‌ల‌గం వేణు. ఒక‌ప్పుడు త‌న‌ను కేవ‌లం కామెడియ‌న్ గా మాత్ర‌మే చూసే వార‌ని కానీ దిల్ రాజు పుణ్య‌మా అని ఇవాళ యావ‌త్ లోకం బ‌ల‌గం వేణు అంటూ పిలుస్తోంద‌న్నారు.

ఇప్ప‌టికీ బంధాల విలువ ఏమిటో చెప్పిన తీరుకు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని , తాను కూడా ఇంత పెద్ద ఎత్తున ఆద‌రిస్తార‌ని అనుకోలేద‌న్నారు. కానీ సినిమా తీశాక తెలిసింది ఏమిటంటే కంటెంట్ లో బ‌లం ఉంటే బ‌ల‌గం అదంత‌కు అదే వ‌స్తుంద‌ని తేలి పోయింద‌ని అన్నారు బ‌ల‌గం వేణు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను తీసిన సినిమాకు అంత‌ర్జాతీయ ప‌రంగా 31 అవార్డులు ద‌క్కాయ‌ని, త‌న జీవితానికి ఇది చాల‌న్నారు వేణు(Balagam Venu).

Also Read : త‌లైవాతో దిల్ రాజు సినిమా

Leave A Reply

Your Email Id will not be published!