Chandrababu Naidu : జేడీ కూతురి పెళ్లిలో చంద్ర‌బాబు

జంట‌ను అభినందించిన టీడీపీ చీఫ్

Chandrababu Naidu : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ కూతురు వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). ఆయ‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. వారిని స్వ‌యంగా జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ దేశంలోనే పేరు పొందిన పోలీసు ఆఫీస‌ర్ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందారు. ఆయ‌న ఎక్కువ‌గా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది మాత్రం ఆనాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌స్తుత ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డం. ఇదే క్ర‌మంలో మైనింగ్ బార‌న్ గా గుర్తింపు పొందిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డిని అదుపులోకి తీసుకోవ‌డంతో ఒక్కసారిగా ల‌క్ష్మీ నారాయ‌ణ వెలుగులోకి వ‌చ్చారు. ఇలాంటి ధైర్య‌వంతులు, నిజాయితీ ప‌రులైన ఆఫీస‌ర్లు కావాల‌ని దేశం మొత్తం కోరుకుంది.

కానీ ఆ త‌ర్వాత జేడీ లక్ష్మీనారాయ‌ణ త‌న వృత్తి ధ‌ర్మం నుంచి ముంద‌స్తు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఇంపాక్ట్ ద్వారా యువ‌త‌ను జాగృతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

Also Read : Deepika Padukone : దీపికా ఏడాది సంపాద‌న రూ. 40 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!