Karnataka Govt : కర్ణాటక సర్కార్ పన్నుల మోత
ఆచరణకు నోచుకోని హామీల భారం
Karnataka Govt : కర్ణాటక లో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ జనానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేసేందుకు కోట్లాది రూపాయలు కావాల్సి వుంది. దీంతో గత్యంతరం లేక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రజల మీద పన్నుల మోత మోగిస్తూ విస్తు పోయేలా చేస్తున్నారు.
Karnataka Govt Updates
తాజాగా కర్నాటకలో గైడెన్స్ వాల్యూ పేరుతో రిజిస్ట్రేషన్లపై టాక్స్ పెంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు మొదలయ్యాయి. వీటిని అమలు చేయాలంటే ఖజానా సరి పోవడం లేదు.
ఇప్పటికే అన్న భాగ్య కోసం పలు రాష్ట్రాలను సంప్రదించినా చివరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మాత్రమే స్పందించాయి. రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకు పన్నులు వడ్డించే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్.
బెంగళూరులోని కమర్షియల్ స్థలాలపై 25 శాతం నుండి 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగుకు రూ. 500 నుండి రూ. 750కి పెంచింది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Kasireddy Narayan Reddy : బీఆర్ఎస్ కు షాక్ కసిరెడ్డి గుడ్ బై