PM Modi Posters : హైదరాబాద్ – తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు శంషాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలలో కొలువు తీరాయి.
PM Modi Posters Viral
కేవలం హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో విమర్శలు కొనసాగుతున్నాయి.
ఈ మధ్యన పదే పదే పార్లమెంట్ లో తెలంగాణ పట్ల తన అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్నాడు మోదీ(PM Modi). ఏపీ విభజన సరిగా జరగలేదంటూ సాక్షాత్తు సభలో ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇటీవల మంత్రి కేటీఆర్. పనిగట్టుకుని తెలంగాణను దూషించడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
మరో వైపు ఇదంతా నాటకం అంటూ కొట్టి పారేస్తోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. బయట బీజేపీ, బీఆర్ఎస్ తిట్టుకుంటాయని కానీ లోలోపట ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒక్కటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. మొత్తంగా పీఎంకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read : Karnataka Govt : కర్ణాటక సర్కార్ పన్నుల మోత